Monday, November 12, 2012

మంగళవారం నాడు భూమిని తవ్వకూడదని ఎందుకంటారు?



మంగళవారానికి కుజుడు అధిపతి. ఈయనను మంగళుడు, అంగారకుడు అని కూడా అంటారు. అతడు భూమిపుత్రుడు. భూమిని తవ్వడానికి ఉపయోగించే గునపాలు, పారలు వంటి వాటికి కూడా కుజుడే అధిపతి. ఆయన తన సంకేతాలైన గడ్డపారలు వంటి వాటితో తన తల్లి అయిన భూమిని గాయపరుస్తుంటే సహించలేడు. అందుకే మంగళవారం నాడు భూమిని తవ్వకూడదని పురాణాలు చెబుతున్నాయి. అలాగే కుజుడు అగ్నితత్వం కలవాడు కాబట్టి, అగ్ని ప్రమాదాలను నివారించేందుకు గాను, అతడు అధిపతిగా ఉన్న మంగళవారం నాడు భూమిని తవ్వకూడదని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. 

No comments:

Post a Comment